కాళేశ్వరం/మహాదేవపూర్: కాళేశ్వరం ప్రాజెక్టులోని సరస్వతీ, లక్ష్మీ బరాజ్లను తమిళనాడుకు చెందిన 20 మంది నీటి పారుదల శాఖ ఇంజినీర్లు శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయా బరాజ్ల్లోని వ్యూ పాయింట్ వద్దకు చేరుకుని నీటి సామర్థ్యాన్ని పరిశీలించారు. బరాజ్ల ఆవశ్యకతను, తదితర వివరాలను సంబంధిత ఇంజినీరు అధికారులను అడిగి తెలుసుకుని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
లక్ష్మీ బరాజ్ను సందర్శించడం ఆనందంగా ఉందని, తమ రాష్ట్రంలో ఇలాంటివి నిర్మించేందుకు స్వయంగా పరిశీలనకు వచ్చినట్లు తమిళనాడు ఇంజనీర్లు వెల్లడించారు. వారి వెంట ఇరిగేషన్ డీఈఈ సతీశ్, ఏఈఈ యాకయ్య, డీఈ సురేశ్, జేఈ వలీ, శ్రవణ్, భరత్ ఉన్నారు.