హైదరాబాద్, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ): బ్యాంకు కుంభకోణానికి పాల్పడిన 10 మందికి సీబీఐ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి జైలు శిక్ష ఖరారు చేశారు. కొందరు ప్రైవేట్ వ్యక్తులతో కుమ్మక్కయి 2013లో అప్పటి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, సికింద్రాబాద్ బ్రాంచ్ సీనియర్ మేనేజర్ శరత్బాబు జెల్లీ బ్యాంకు నిధులను దారి మళ్లించాడు. నకిలీ పత్రాలపై మొత్తం రూ.5 కోట్లకు వరింగ్ క్యాపిటల్ లిమిట్లను మం జూరు చేశారు.
తద్వారా బ్యాంకుకు రూ.4,57,86,35 నష్టం వాటిల్లింది. బ్యాంకు అధికారుల ఫిర్యాదుతో సీబీఐ కేసు పెట్టి విచారణ చేపట్టింది. 2014లో నిందితులపై చార్జిషీట్ దాఖలైంది. తా జాగా నిందితులను ట్రయల్ కోర్టు దో షులుగా నిర్ధారించింది. బ్యాంకు అధికారులు, ప్రైవేట్ వ్యక్తులు మొదలైన వా రితో సహా పది మందికి జరిమానాతో పాటు ఒకటి నుంచి ఏడేండ్ల్ల వరకు కఠి న కారాగార శిక్షలను ఖరారు చేసింది.