సికింద్రాబాద్ ర్వైల్వే స్టేషన్ సుందరీకరణలోభాగంగా ‘ఐ లవ్ సికింద్రాబాద్’ అనే సెల్పీ పాయింట్ను ఏర్పాటు చేశారు. రైల్వే స్టేషన్లోని ప్లాట్ఫాం నంబర్ 10 వద్ద దీన్ని దక్షిణమధ్య రైల్వే ఏర్పాటు చేసింది. భారతీయ రైల్వేల్లో అతిపెద్ద, రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఒకటి. ఈ స్టేషన్లో రోజువారీ సగటు ప్రయాణికులు దాదాపు 1.50 లక్షలని దక్షిణమధ్య రైల్వే ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. జంట నగరాల్లోనే సికింద్రాబాద్ ఒక ప్రముఖ స్టేషన్ కావడంవల్ల ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణగా మారింది. ఇది దేశవ్యాప్తంగా ఉన్న ప్రయాణికుల దృష్టిని ఆకర్షిస్తున్నది.
ఇప్పుడు ఏర్పాటు చేసిన సెల్పీ పాయింట్ సెల్ఫీ ప్రియులు, పర్యాటకులు, బ్లాగర్లు, ప్రయాణికులకు వినోద కార్యకలాపంగా ఉపయోగపడుతుంది. అందరూ సంచరించే ప్రదేశంలో ఏర్పాటు చేసిన ఈ ఐకానిక్ టైపోగ్రాఫికల్ శిల్పం రాత్రిపూట ప్రకాశిస్తుంది. కాగా, ఈ సృజనాత్మక చొరవ తీసుకున్న సికింద్రాబాద్ డివిజన్ అధికారులు బృందాన్ని దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ (ఇన్చార్జి) అరుణ్ కుమార్ జైన్ అభినందించారు.