ఆదిలాబాద్ : జిల్లాలోని బేల మండలంలో గల డీసీసీబీ బ్యాంక్లో భారీ స్కాం వెలుగు చూసింది. బ్యాంకులో రూ.2.8 కోట్ల నిధులు గోల్మాల్ జరిగాయని ఆరోపణలు వెల్లువెత్తాయి. కోట్ల రూపాయలను బ్యాంక్ సిబ్బందే కాజేశారనే ఆరోపణలపై బ్యాంక్ ఉన్నతాధికారులు విచారణ జరిపారు.
ఈ విచారణలో పలువురు బ్యాంకు అధికారులు, సిబ్బంది అక్రమాలకు పాల్పడ్డారని తేలింది. బ్యాంకులోని ఇద్దరు అసిస్టెంట్ మేనేజర్లతో పాటు తొమ్మిది మంది సిబ్బంది నిధులను తమ ఖాతాలోకి మలచుకున్నారు. సెప్టెంబర్ నుంచి మార్చి వరకు సిబ్బంది నిధుల మళ్లింపునకు పాల్పడ్డారు. డబ్బులు కాజేసిన 11 మంది సిబ్బందిని అధికారులు సస్పెండ్ చేశారు.