హైదరాబాద్, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ): వాణిజ్య పన్నులశాఖ ఇన్చార్జి కమిషనర్గా టీకే శ్రీదేవిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
శ్రీదేవి 2004 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ ఆఫీసర్. రాష్ట్ర ఆర్థికశాఖ కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్న శ్రీదేవికి కమర్షియల్ ట్యాక్స్ ఇన్చార్జి కమిషనర్గా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ నేపథ్యంలో సోమవారమే ఆమె బాధ్యతలు చేపట్టారు.