Nizamabad | నిజామాబాద్ : జిల్లా పరిధిలోని మోపాల్ పోలీసు స్టేషన్ వద్ద ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకునే ప్రయత్నం చేశారు. అప్రమత్తమైన పోలీసులు అతన్ని అడ్డుకున్నారు. బాధితుడిని మోపాల్ మండలం సింగంపల్లికి చెందిన రాజుగా పోలీసులు గుర్తించారు. అయితే కుమార్తె వివాహం తనకు తెలియకుండా చేస్తోందని భార్యపై రాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 4 రోజుల క్రితం ఫిర్యాదు చేసినా, పోలీసులు పట్టించుకోవడం లేదని రాజు వాపోయాడు.