కాజీపేట, ఏప్రిల్ 2: కాజీపేట (Kazipet) రైల్వే జంక్షన్లో రైలు ఎక్కుతున్న క్రమంలో చెప్పు పడిపోయిందని ఓ ప్రయాణికుడు రైల్వేబోర్డుకు ట్విట్టర్లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు రైల్వే పోలీసులు స్పందించి పడిపోయిన చెప్పును ప్రయాణికుడికి అప్పగించారు. ఈ ఘటన ఆదివారం ఆలస్యంగా వెలుగుచూసింది. రైల్వే పోలీసులు (CRPF Police) తెలిపిన వివరాల ప్రకారం.. జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్కు చెందిన ఓ ప్రయాణికుడు గురువారం కాకతీయ రైలు ఎక్కుతున్న క్రమంలో తన చెప్పు జారి పడిపోయిందని రైల్వే బోర్డు ట్విట్టర్ ఖాతాలో ఫిర్యాదు చేశాడు. ప్రయాణికుడి సమస్యను పరిష్కరించాలని రైల్వేబోర్డు అధికారులు.. సెక్యూరిటీ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఆర్పీఎఫ్ పోలీసులు పడిపోయిన చెప్పును శనివారం రాత్రి ప్రయాణికుడికి అప్పగించారు.