జనగామ రూరల్, డిసెంబర్21: నర్తకులు, గాయకులను ఎలా గౌరవించుకోవాలో తెలిపే శాసనం ఇటీవల వెలుగు చూసింది. జనగామ మండలం పెంబర్తి గ్రామంలోని కంబాల కుంట దిగువన ముళ్ల పొదల్లో చరిత్ర పరి శోధకుడు రెడ్డి రత్నాకర్రెడ్డి కొత్త శాసనాన్ని గుర్తించారు. ఇది కన్నడ భాషలో 3 వైపులా చెక్కిఉన్నది. శాసనం పైభాగంలో శివ లింగం, వీరభద్రుడు, మహిషాసుర మర్దిని, వినాయకుడి శిల్పాలు ఉన్నాయి. పైన తామర పువ్వు చెక్కారు. శాసనం వివరాలు కళ్యాణి చాళుక్య రాజు సత్యాశ్రయుని కాలంలో శక 917జయ, శ్రావణ, సు1 అనగా 995 సంవత్సరం జూలై 12న వేయబడింది.