పోలీసులను ఓ వింత ఫిర్యాదు షాక్కు గురి చేసింది. తనను ఓ కుక్క రోజూ కరుస్తోందని, దాని యజమానిపై కేసు నమోదు చేయాలంటూ ఓ వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు. ఈ వింత ఘటన మహబూబాబాద్లో జరిగింది.
వివరాల్లోకెళితే, మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన ధరావత్ పూల్యనాయక్ సోమవారం పోలీస్ స్టేషన్కు వచ్చాడు. గూడూరు మండలకేంద్రంలోని వ్యవసాయ శాఖ కార్యాలయ సమీపంలో ఓ కుక్క ప్రతిరోజూ తన వెంటపడుతున్నదని, కరుస్తున్నదంటూ ఫిర్యాదు చేశాడు. దాన్ని కట్టేయకుండా బహిరంగ ప్రదేశాల్లో వదిలిపెడుతున్న యజమానిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ వింత ఫిర్యాదును చూసి పోలీసులు అవాక్కయ్యారు. చేసేదేమిలేక కుక్క యజమానిని పిలిచి, మందలించి పంపారు. ధరావత్ పూల్యనాయక్కు చికిత్స చేయించాలని ఆ యజమానిని ఆదేశించారు.