హైదరాబాద్, జనవరి 14 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని మత్స్యకారులకు భరోసా కల్పించేందుకు కేసీఆర్ ప్రభుత్వం తలపెట్టిన ఉచిత చేపపిల్లల పంపిణీ పథకాన్ని కొనసాగించాలని జాతీయ ఎంబీసీ సంఘాల సమితి విజ్ఞప్తి చేసింది. రాష్ట్రంలోని 47 వేల చెరువుల్లో, 6,800 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు ఉన్నాయని ఎంబీసీ జాతీయ కన్వీనర్ కొండూరు సత్యనారాయణ పేర్కొన్నారు. వారి సంక్షేమం నిమిత్తం పెండింగ్లో ఉన్న రూ.104 కోట్ల బిల్లును విడుదల చేయాలని, ఈ ఏడాది కూడా ఉచితంగా చేపపిల్లలు పంపిణీ చేయాలని కోరారు.