మహబూబ్నగర్ : జిల్లాలోని అడ్డాకుల(Addakula) 44వ జాతీయ రహదారిపై ప్రైవేటు బస్సు((Volvo bus )కు పెను ప్రమాదం తప్పింది. అడ్డాకుల సబ్ స్టేషన్ సమీపంలో జాతీయ రహదారి 44 పై కర్నూలు నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న (AP 39 UQ 8584) నంబర్ గల వోల్వో బస్సువేగంగా వెళ్తున్న క్రమంలో టైరు ఊడిపోయి మంటలు(Fire broke) చెలరేగాయి. ప్రమాదాన్ని గమనించిన డ్రైవర్ అప్రమత్తతో బస్సును రోడ్డు పక్కన ఆపి మంటలార్పడంతో ప్రమాదం తప్పింది. బస్సులో 30 మంది ప్రయాణికులున్నారు. తృటిలో భారీ ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.