ఆదిలాబాద్, మే 30 (నమస్తే తెలంగాణ) : ‘జొన్నలను ఆదిలాబాద్ జిల్లా తాంసి మార్కెట్ యార్డుకు తీసుకొచ్చి పది రోజులు అవుతున్నది. ఎప్పుడు కొంటరో తెలుస్తలేదు. నా భార్యాపిల్లలను చూసి పది రోజులు అవుతున్నది. ఇంటికి ఎప్పుడొస్తావు నాన్న.. అని పిల్లలు ఫోన్ చేసి అడుగుతున్నరు సార్’ అంటూ ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం కొత్తూర్కు చెందిన రైతు విజయ్.. బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఎదుట కంటతడి పెట్టుకున్నాడు. శనివారం ఎమ్మెల్యే తాంసి మార్కెట్ను సందర్శించగా రైతులు తమ సమస్యలను చెప్పుకొన్నారు.