పాలకవీడు, మార్చి 1: సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం శూన్యపహాడ్ గ్రామంతోపాటు చుట్టుపక్కల గ్రామాల్లో నెలకొన్న తీవ్ర నీటి ఎద్దడిపై యువ రైతు, కాంగ్రెస్ కా ర్యకర్త రమావత్ రమేశ్ సైదానాయక్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. సాగునీరు లేక ఎండిపోతున్న తన పంటను చూపిస్తూ సెల్ఫీ వీడి యో తీసి ఫేస్బుక్లో పోస్ట్ చేయడంతో సో షల్ మీడియాలో వైరల్ అయింది. కాగా, ఆ యనది భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి సొంత నియోజకవర్గం కావడం మరింత చర్చనీయాంశంగా మారిం ది.
రైతు రమావత్ రమేశ్ ఆవేదన ఆయన మాటల్లోనే.. ‘ఉత్తమ్ అన్నా, మాది సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గం పా లకవీడు మండలం శూన్యపహాడ్ గ్రామం. మా గ్రామం 50 ఏండ్లుగా కాంగ్రెస్కు కంచుకోట. మేము ఓట్లేసి కాంగ్రెస్ను గెలిపించుకున్నం. మీరు నీటి పారుదల శాఖ మంత్రి అయినరు. మాకాడ ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు నాకు కొడుకులు, బిడ్డలు లేరు. మీరే బిడ్డలు అని చెప్పారు. గద్దెనెక్కినాక మే మున్నామనే ధ్యాసే మరిచారు. మా పొలాలు ఎండిపోతుంటే ఎవరు స్పందిస్తలేరు. మూసీ ఎండిపోయింది. తాగడానికి నీళ్లు లేవు. జీ వాలు అన్ని సచ్చిపోయే స్థితికి వచ్చినయి. ఇ ది నా పొలం. వందల మంది తినే ఆహారం. నిప్పుపెడితే కాలిపోయేట్టు ఉన్నది. రెండు తడులు నీళ్లిస్తే బయట పడుతాం. ఎందుకు సచ్చేదాకా చూస్తరు. మా మంత్రివర్యులు ని ద్ర మత్తులో ఉన్నా.. సీఎం రేవంత్రెడ్డి స్పం దించి నీళ్లయినా, పరిహారమైనా ఇవ్వా లి’ అంటూ రమేశ్ వీడియోలో వాపోయాడు.