జగిత్యాల : జగిత్యాల జిల్లాలో దారుణం జరిగింది. తారకరామ నగర్లో తండ్రి, ఇద్దరు కుమారులను ప్రత్యర్థులు అత్యంత దారుణంగా హత్య చేశారు. ఇవాళ ఉదయం కుల సంఘం సమావేశం నిర్వహించారు. అయితే హత్యకు గురైన కుటుంబంపై ప్రత్యర్థులు మంత్రాల నెపం మోపారు. మంత్రాలు చేసి పలువురిని అనారోగ్యానికి గురి చేస్తున్నారని ఆరోపించారు.
ఈ క్రమంలో సదరు కుటుంబంపై ప్రత్యర్థులు దాడి చేశారు. ప్రత్యర్థుల దాడిలో తండ్రి, ఇద్దరు కుమారులు ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న జగిత్యాల రూరల్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. మృతులను తండ్రి నాగేశ్వర్ రావు, కుమారులు రాంబాబు, రమేశ్గా పోలీసులు గుర్తించారు.