నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లాలో బీజేపీ కార్పొరేటర్ భర్తను ఓ మహిళ చెప్పుతో కొట్టింది. తమ కూతురిని బ్లాక్ మెయిల్ చేసి వివాహేతర సంబంధం పెట్టుకుని మోసం చేశాడని బాధితురాలి తల్లి వాపోయింది. తన కూతురిని మోసం చేశాడంటూ వినాయక నగర్లోని కార్పొరేటర్ భర్త ఇంటిముందు బాధితురాలి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు.
రాత్రి తన కూతురిని ఎత్తుకెళ్లిన కార్పొరేటర్ భర్త ఆకుల శీనును రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నమంటూ బాధితురాలి తల్లిదండ్రులు ఆరోపించారు. మాకు న్యాయం చేయాలంటూ అమ్మాయి తల్లిదండ్రుల ఆవేదన వ్యక్తం చేశారు. ఇవాళ ఉదయం ఆకుల శీను ఇంటికి వెళ్లి ఆయనపై దాడి చేశారు. తమ కూతురిని అప్పగించాలంటూ తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.