హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ): సెంటర్ ఫర్ ఫోర్త్(4) ఇండస్ట్రియల్ రివల్యూషన్ (సీ4ఐఆర్) సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ జెర్మీ జుర్జెన్స్తో కూడిన ప్రతినిధుల బృందం బుధవారం టీ వర్క్స్ను సందర్శించింది. గత కేసీఆర్ ప్రభుత్వం దేశంలోనే మొట్టమొదటిసారిగా ప్రతిష్ఠాత్మక టీ వర్క్స్ను ఏర్పాటు చేసింది. తయారీ రంగంలో సరికొత్త ఆలోచనలతో వస్తువుల రూపకల్పన చేసేందుకు ఏర్పాటుచేసిన టీవర్క్స్లోని అన్ని విభాగాలను ప్రతినిధుల బృందం సందర్శించింది. ఈ సందర్భంగా బృందం సభ్యులకు ఐటీ శాఖ పరిధిలోని ఎమర్జింగ్ టెక్నాలజీస్ వింగ్ ఓఎస్డీ రమాదేవి టీ వర్క్స్ పనితీరును, అందులో ఔత్సాహిక వ్యాపారవేత్తలను కల్పించిన మౌలిక వసతులను వివరించారు.