ICRISAT | హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 24 (నమస్తే తెలంగాణ): నేల స్వభావాన్ని గుర్తించేందుకు వీలుగా ఇక్రిశాట్ పరిశోధకులు ‘ప్లాస్మా ఆప్టికల్’ సాయిల్ టెస్టింగ్ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చారు. దీని ద్వారా మట్టి నాణ్యత, పోషకాల పరిమాణం, నీటిలో ఉన్న కాలుష్య కారకాలు, లోపించిన మినరల్స్ను 14 రకాల పరీక్షలు నిర్వహించి తెలుసుకోవచ్చు.
ఇక్రిశాట్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక ల్యాబ్లో ఏకకాలంలో 250కి పైగా శాంపిళ్లను పరీక్షించవచ్చు. ఇప్పటివరకు ఈ ల్యాబ్లో 2,86,449 మట్టి రకాలను విశ్లేషించారు. 4.5 లక్షల పంటలను అధ్యయనం చేశారు. తెలంగాణలోని ఆయా ప్రాంతాల వాతావరణ, నీటి లభ్యత ఆధారంగా నేలకు అవసరమైన పోషకాలను సూచిస్తున్నారు.