గోమాత.. ఓ గొర్రెపిల్లకూ మాత అయ్యింది. తన జాతి భేదాన్ని మరిచి.. గొర్రెపిల్లకు పాలిచ్చి ఆకలి తీర్చుతున్నది. ఈ అరుదైన ఘటన జోగుళాంబ గద్వాల జిల్లాలో మంగళవారం వెలుగుచూసింది. అలంపూర్ నియోజకవర్గంలోని చండూరు గ్రామ శివారులోని ఓ రైతు వ్యవసాయ క్షేత్రంలో పెరుగుతున్న గొర్రెపిల్ల తల్లి ఇటీవల మరణించింది.
దీంతో ఆ గొర్రెపిల్ల అక్కడే ఉన్న ఆవుల మందలోని ఓ ఆవు పాలకు అలవాటు పడింది. తరచూ ఆకలి తీర్చుకోవడానికి ఆవు చెంతకు చేరి పాలు తాగుతున్నది. ఆవు కూడా ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా గొర్రెపిల్లకు పాలిచ్చి కడుపునింపుతున్నది.
-వనపర్తి