హైదరాబాద్, జూలై 25(నమస్తే తెలంగాణ): స్వతంత్ర భారత వజ్రోత్సవాల పేరిట 15 రోజుల పాటు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాల నిర్వహణకు ఎంపీ కే కేశవరావు నేతృత్వంలో సోమవారం ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటుచేసింది. ఆగస్టు 8 నుంచి 22 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 75 ఏండ్ల స్వాతంత్య్ర ఉత్సవాలను నిర్వహిస్తారు. స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తి, వీరుల త్యాగాలు, దేశభక్తి ప్రేరణ ఉట్టిపడేలా ప్రజల్లో, ముఖ్యంగా యువతలో ప్రేరణ కలిగించేలా కార్యక్రమాలను జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. మంత్రులు కే తారకరామారావు, తలసాని శ్రీనివాస్ యాద వ్, శ్రీనివాస్గౌడ్, సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్రావు, సాంస్కృతిక సారథి రసమయి బాలకిషన్, ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, సీఎస్ సోమేశ్కుమార్, డీజీపీ మహేందర్రెడ్డి, ఎంపీ రంజిత్రెడ్డి, ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్, ఎమ్మెల్యే సుధీర్రెడ్డి, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్, సీఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్, వివిధ శాఖల కార్యదర్శులు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు.