Viral | టిక్టాక్ పుణ్యమా అని నేటి యువతకు సోషల్మీడియా పిచ్చి బాగా అంటుకుంది. మన దేశంలో టిక్టాక్ బ్యాన్ చేసినప్పటికీ దాని మోజు మాత్రం తగ్గలేదు. ఇంచుమించు అదే కాన్సెప్ట్తో వచ్చిన ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ షార్ట్స్లోనూ తమ పైత్యం చూపిస్తున్నారు. లైకులు, ఫాలోవర్స్ కోసం ఏది పడితే అది చేసేస్తున్నారు. కొత్తగా ఏదైనా ట్రై చేయాలనే అత్యుత్సాహంతో ఏం చేస్తున్నారో కూడా ఆలోచించడం లేదు. రకరకాల విన్యాసాలు తెచ్చి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా ఓ యువతి ఇలాగే నడిరోడ్డు మీదకు వచ్చి డ్యాన్స్ చేసింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్మీడియాలో వైరల్గా మారింది.
ఈ వీడియోలో.. రద్దీగా ఉన్న ఓ రోడ్డు మధ్యలోకి ఓ అమ్మాయి నడుచుకుంటూ వచ్చింది. ఆ తర్వాత తన కాలేజీ బ్యాగ్ను పక్కకు పడేసింది. వెంటనే రోడ్డుపై పడుకుని స్టెప్పులు వేసింది. అప్పటికే సిగ్నల్ పడి ఉండటంతో అక్కడ ఉన్న వాహనదారులంతా ఆమెను వింతగా చూడటం ఈ వీడియోలో కనిపించింది. 23 సెకన్ల పాటు ఉన్న ఈ వీడియో ఇప్పుడు సోషల్మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇదే వీడియోను టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కూడా తన ట్విట్టర్ (ఎక్స్) ద్వారా షేర్ చేశారు. నేటి యువతకు ఇన్స్టా రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ పిచ్చి పట్టుకోవడం చాలా బాధాకరమని అన్నారు. సమాజానికి పనికొచ్చే పనులు చేసి నలుగురికీ ఆదర్శంగా నిలవాల్సిన యువతరం.. సోషల్మీడియా మత్తులో జీవితాలను నాశనం చేసుకుంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో రాత్రికి రాత్రే పాపులర్ కావడం కోసం నడిరోడ్డుపై ఇలాంటి వెర్రి చేష్టలు చేస్తూ ఇతరులకు తీవ్ర అసౌకర్యం కల్పించడం ఏం ఆనందమో ఏమో అని తన ట్వీట్లో పేర్కొన్నారు.
నేటి యువతకు ఇన్స్టా రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ పిచ్చి పట్టుకోవడం బాధాకరం. సమాజానికి పనికి వచ్చే పనులు చేసి నలుగురికి ఆదర్శంగా నిలవాల్సిన యువతరం.. సోషల్ మీడియా మత్తులో పడి జీవితాలను నాశనం చేసుకుంటోంది. సోషల్ మీడియాలో రాత్రికి రాత్రే పాపులర్ కావడం కోసం నడి రోడ్డుపై ఇలాంటి వెర్రి… pic.twitter.com/RQ6aGEWUet
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) December 24, 2023