హైదరాబాద్ : చర్లపల్లి(Charlapalli)లోని బీఎన్ రెడ్డి నగర్(BN Reddy Nagar)లో విషాదం చోటు చేసుకుంది. స్కూల్ బస్ (School bus) ఢీకొని నాలుగేళ్ల బాలుడు ప్రణయ్ మృతి చెందాడు(Pranay). బాలుడు అమ్మమ్మతో కలిసి వస్తుండగా ఓ స్కూల్ బస్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రణయ్ మృతితో బంధువుల రోదనలు మిన్నంటాయి. పూర్తి వివారాలు తెలియాల్సి ఉంది.