35 ట్రాఫిక్ చలాన్లు ఉన్న ఓ ద్విచక్ర వాహనదారుడి నుంచి ట్రాఫిక్ పోలీసులు రూ.8,125 వసూలు చేశారు. కొత్తగూడెం ట్రాఫిక్ ఎస్సై రాజేందర్ స్థానిక పోస్టాఫీస్ వద్ద ఆదివారం వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో పట్టణంలోని బాబుక్యాంపునకు చెందిన దైడ ఆనంద్ బైకుపై 35 చలాన్లు పెండింగ్లో ఉన్నట్టు తేలింది. అతడికి కౌన్సెలింగ్ ఇచ్చి, మొత్తం రూ.8,125 బకాయి కట్టించారు.
–కొత్తగూడెం క్రైం