హైదరాబాద్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ): మత్స్య సొసైటీల్లో సభ్యులుగా చేర్చుకొనేందుకు అభ్యర్థులకు నిర్వహించే స్కిల్ టెస్టు నిబంధనల్లో పలు మార్పులు చేస్తూ మత్స్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధర్సిన్హా బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ముగ్గురు సభ్యుల కమిటీలో డివిజినల్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ ఫిషరీస్ కాకుండా ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్ను నియమించింది. అదే విధంగా అన్ని రకాల నీటి వనరుల్లో వల విసిరినప్పుడు 60 శాతం సర్కిల్ ఏర్పడాలని పేర్కొన్నది. దీంతో పాటు సాధారణ నీటి వనరుల్లో 50 మీటర్లు, రిజర్వాయర్లలో 100 మీటర్ల దూరం ఈతకొట్టేలా నిబంధనల్లో మార్పులు చేసింది.