హైదరాబాద్, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో 93.1 శాతం మందిలో కరోనా వైరస్కు యాంటిబాడీలు వృద్ధి చెందినట్టు సెరో సర్వేలో తేలింది. తెలంగాణలో వైరస్ వ్యాప్తి తీరును తెలుసుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం, భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్), జాతీయ పోషకాహార సంస్థ(ఎన్ఐఎన్) సంయుక్తంగా జనవరి-ఫిబ్రవరి నెలల్లో సర్వే నిర్వహించాయి. రాష్ట్రంలోని 330 గ్రామాల్లో 18 వేల మంది నుంచి రక్తనమూనాలు సేకరించి, కొవిడ్ నిరోధక ప్రతిరక్షకాలను పరీక్షించింది. ఆ వివరాలను రాష్ట్ర వైద్యారోగ్యశాఖ గురువారం విడుదల చేసింది.