హైదరాబాద్, ఫిబ్రవరి 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో 9 మంది ఐఏఎస్లు, ఒక ఐఎఫ్ఎస్ అధికారిని బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. అసమర్థ అధికారిగా విమర్శలు ఎదుర్కొన్న సమాచారశాఖ కమిషనర్ కే అశోక్రెడ్డికి ఉద్వాసన పలికింది. ఆయ న స్థానంలో ఎం హన్మంతరావును నియమించింది. అశోక్రెడ్డికి హార్టికల్చర్ డైరెక్టర్ బాధ్యతలు అప్పగించింది. సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ గురుకులాల కార్యదర్శి నవీన్నికోలస్ను టీఎస్పీఎస్సీ సెక్రటరీగా బదిలీ చేసింది. జూపార్క్ డైరెక్టర్ వీఎస్ఎన్వీ ప్రసాద్కు సివిల్ సప్లయ్ డైరెక్టర్గా, చీఫ్ రేషనింగ్ ఆఫీసర్ బీ బాలమాయదేవిని బీసీ వెల్ఫేర్ కమిషనర్గా, టీఎస్పీఎస్సీ సెక్రటరీ అనితా రామచంద్రన్ను పంచాయతీరాజ్ కమిషనర్గా, ఫిషరీస్ కమిషనర్గా బీ గోపీ, స్త్రీ శిశుసంక్షేమ, ఎస్సీ వెల్ఫేర్ కమిషనర్గా ఏ నిర్మలకాంతివెస్లీ, సాంఘిక సంక్షేమ గురుకులాల కార్యదర్శిగా కే సీతాలక్ష్మిని, వెయింటింగ్లో ఉన్న జీ ఫణీంద్రరెడ్డిని చీఫ్ రేషనింగ్ ఆఫీసర్గా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది.