హైదరాబాద్, జూలై 18 (నమస్తే తెలంగాణ): విదేశాలు, ఇతర రాష్ర్టాల నుంచి అక్రమంగా మద్యాన్ని తీసుకొస్తున్న అక్రమ రవాణాదారులపై తెలంగాణ ఆబ్కారీశాఖ ఉక్కుపాదం మోపుతున్నది. అధికారులు పటిష్ట నిఘాతో రాష్ట్ర సరిహద్దుల్లోనే నకిలీ, కల్తీ మద్యం అక్రమ రవాణాను అడ్డుకుంటున్నా రు. రాష్ట్రవ్యాప్తంగా 20 చెక్పోస్టుల వద్ద వా హనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి అక్రమార్కులను ఎక్కడికక్కడే అరెస్టు చేస్తున్నారు. 2014 నుంచి 2023 జూన్ 30 వరకు నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ (ఎన్డీపీఎల్) కేసులు 1,801 నమోదు చేసి, 1,937 మందిని అరెస్టు చేశారు. 83,888.12 లీటర్ల మద్యా న్ని, 373 వాహనాలను సీజ్ చేశారు. హ ర్యానా, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ రాష్ర్టాల నుంచి నకిలీ మద్యం ఇటువైపు రా కుండా కఠిన నిఘాను అమలు చేస్తున్నారు. గడిచిన ఆరు నెలల్లో 738 కేసులు పెట్టి, 597 మందిని అరెస్టు చేసి, 12,682 లీటర్ల మద్యా న్ని స్వాధీనం చేసుకున్నారు.