హైదరాబాద్, జనవరి 31 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం నియమించిన స్టాఫ్ నర్సుల్లో ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన 80 మంది అభ్యర్థులు ఉన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలోనే మొట్టమొదటిగా హైదరాబాద్ను పైలట్గా ఎంచుకొని నర్సింగ్, జీఎన్ఎం పూర్తిచేసిన దళిత యువతులకు విదేశాల్లో ఉద్యోగావకాశాలను కల్పించేందుకు చర్యలు చేపట్టింది. నర్సింగ్ పూర్తిచేసి, విదేశాల్లో ఉపాధి పొందాలనే ఆసక్తి, ఆర్హత ఉన్న దళిత యువతులను ఎంపిక చేసి, ఫినిషింగ్ స్కూల్, షార్పెనింగ్ స్కిల్స్పై మూడునెలలపాటు ప్రత్యేక శిక్షణ ఇచ్చింది. ఫీజును ప్రభుత్వమే చెల్లించింది. స్టాఫ్నర్స్లుగా ఉద్యోగాలను పొందిన అభ్యర్థులకు తెలంగాణ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఫర్ నర్సెస్ ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్ సీహెచ్ సైదులు శుభాకాంక్షలు తెలియజేశారు.