మలక్పేట, ఫిబ్రవరి 25: రాష్ట్రం నుంచి హజ్ యాత్రకు వెళ్లేందుకు హజ్ కమిటీ కోటాలో 7,811 మంది హాజీలు ఎంపికయ్యారని రాష్ట్ర ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ వ్యవహారాల సలహాదారు మహ్మద్ షబ్బీర్ అలీ తెలిపారు. ఆదివారం పాత మలక్పేట డివిజన్లోని హైటెక్ గార్డెన్స్లో హజ్ యాత్రికుల అవగాహన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. తెలంగాణ హజ్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో షబ్బీర్ అలీ మాట్లాడుతూ హజ్ యాత్ర కోసం 11,313 మంది దరఖాస్తు చేసుకున్నారని వివరించారు.