హైదరాబాద్, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర వాణిజ్యపన్నుల శాఖ ఏటేటా పోటీ పడి వృద్ధిరేటును సాధిస్తున్నది. సీఎం కేసీఆర్ సారథ్యంలో పటిష్ట ఆర్థిక ప్రణాళికతో తిరుగులేని శక్తిగా ఎదుగుతున్నది. ప్రజల్లో అవగాహన కల్పించటం, కొత్త సంస్కరణలు తదితర మార్పులతో వాణిజ్యపన్నుల శాఖకు అంచనాలకు మించి ఆదాయం సమకూరుతున్నది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.75,189 కోట్లు వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. కానీ, కేంద్రం జీఎస్టీ బకాయిల విడుదలలో జాప్యం చేయటం, కొర్రీలు పెడుతూ రాష్ర్టానికి రావాల్సిన నిధుల్లో కోతలు విధించటం తదితర కారణాలతో అంచనాను రూ.72,500 కోట్లకు కుదించుకున్నది. అయినా, 2022-23 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి రూ.72,582 కోట్ల ఆదాయం సమకూరింది. అంచనా కంటే రూ.82 కోట్లు అధిక రాబడి వచ్చింది. ఒక్క మార్చి నెలలోనే రూ.7, 288 కోట్ల ఆదాయం వచ్చింది.
తెలంగాణను ఆర్థికంగా అడ్డుకునేందుకు కేంద్రం అన్నివిధాలా ప్రయత్నిస్తున్నది. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం అయినప్పటికీ ప్రతి విషయంలో అకసు వెళ్లగకుతున్నది. చివరికి జీఎస్టీ పరిహారం సైతం సరిగా ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నది. ఒకవైపు పన్నులను సెస్లు, సర్చార్జీల రూపంలోకి మార్చుకోవటం వల్ల తెలంగాణకు రావాల్సిన పన్నులు కేంద్ర ఖజానాకు చేరుతున్నాయి. మరోవైపు జీఎస్టీ పరిహారంలో మెలికలు పెడుతూ ప్రతిఏటా ఎంతోకొంత పెండింగ్ పెడుతున్నది. దేశంలోని పెద్దరాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో జీఎస్టీ వసూళ్లు ఆశాజనకంగా ఉన్నాయి. తెలంగాణలో జీఎస్టీ వృద్ధిరేటు ఎకువగా ఉన్నా కేంద్రం నుంచి రావాల్సిన వాటా రావటం లేదు. దేశంలో పెద్దరాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్, తమిళనాడు, పంజాబ్తో పోటీ పడుతూ తెలంగాణ జీఎస్టీ వసూళ్లు సాధిస్తున్నది.
చివరికి కేంద్రం చెప్పిన లెకల ప్రకారం కూడా జీఎస్టీ పరిహారం అందించటం లేదు. గత మూడేండ్లలో కేంద్రం నుంచి తెలంగాణకు రూ.2,433 కోట్ల జీఎస్టీ పరిహారం రావాల్సి ఉన్నది. ఇప్పటి వరకు రూ.16,570 కోట్లు మాత్రమే అందాయి. ఇది దేశంలోని అన్ని ప్రధానరాష్ట్రాల కంటే ఎంతో తకువ. 2020-21, 2021-22 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి రూ.1,371 కోట్లు, 2022-23కు సంబంధించి రూ.1,061 కోట్ల జీఎస్టీ పరిహారం కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సి ఉన్నది. బకాయిలు చెల్లించాలని రాష్ట్రం పదేపదే కేంద్రానికి విన్నవిస్తున్నా, కేంద్రం మాత్రం స్పందించడం లేదు. అయినప్పటికీ, తెలంగాణ మాత్రం సొంతకాళ్లపై నిలబడి ఆర్థికంగా బలమైన శక్తిగా ఆవిర్భవిస్తున్నది. జీఎస్టీ పరిహారాన్ని సైతం కేంద్రం ఇస్తే రాష్ట్ర వాణిజ్యపన్నుల శాఖ రాబడిలో గణనీయమైన వృద్ధిరేటు కనిపిస్తుంది.