బాసర, జూలై 22: బాసర ట్రిపుల్ ఐటీలో ఇటీవల కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ పూర్తి చేసిన తంగళ్లపల్లి నిఖిల్కు రూ.65 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం లభించింది. బహుళజాతి కంపెనీ అమెజాన్లో నిఖిల్ కొలువు సాధించాడు. దీంతో శుక్రవారం నిఖిల్ను ట్రిపుల్ఐటీ ఇంచార్జి వైస్చాన్స్లర్ వెంకటరమణ, డైరెక్టర్ సతీశ్తోపాటు లెక్చరర్లు అభినందించారు. ప్రభుత్వం అం దిస్తున్న విద్యాసదుపాయాలను సద్వినియో గం చేసుకొని ప్రతి ఒక్కరూ ఉన్నత స్థానాల్లో స్థిరపడాలని వారు ఆకాక్షించారు.