హైదరాబాద్, ఏప్రిల్ 28 (నమసే తెలంగాణ): రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో 2014 నుంచి ఇప్పటివరకు 61 రకాల నూతన వంగడాలను ఉత్పత్తి చేసినట్టు వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్ సుధీర్కుమార్ వెల్లడించారు. శుక్రవారం వర్సిటీ ఆడిటోరియంలో జరిగిన సదస్సులో ఆయన మాట్లాడుతూ.. హైడెన్సిటీ ప్లాంటింగ్ సిస్టం (హెచ్డీపీఎస్) పత్తిసాగుపై పరిశోధనలు చేయడంతోపాటు రైతులకు అవగాహన కల్పిస్తున్నట్టు చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళికల వల్ల గత ఐదేండ్లలో పంట సాగు విస్తీర్ణం 52% పెరిగిందని, ఇందులో 85% మేరకు వరి, పత్తి, మొక్కజొన్న, సోయా పంటలే సాగవుతున్నాయని టీఎస్ఎస్డీసీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కేశవులు తెలిపారు.