హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ): వచ్చే నాలుగు నెలల్లో పదవీ విరమణ చేయనున్న రాజ్యసభ సభ్యులతో ఢిల్లీలోని పార్లమెంట్ ప్రాంగణంలో బుధవారం ప్రధా ని మోదీ, ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ఫొ టో సెషన్ నిర్వహించారు. వారితో కలిసి గ్రూ ప్ ఫొటోలు దిగారు. ఈ ఏడాది ఏప్రిల్-జులై మధ్య కాలంలో 59 మంది రాజ్యసభ సభ్యు ల పదవీకాలం ముగియనున్నది. ఈ నేపథ్యం లో బడ్జెట్ సమావేశాల సందర్భంగా పదవీ విరమణ చేయనున్న బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కేఆర్ సురేశ్రెడ్డి, మాజీ ప్రధాని హెచ్డీ దేవేగౌడ సహా ఇతర సభ్యులతో ఉపరాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర మంత్రు లు నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్, అశ్వినీ వైష్ణవ్, కిరణ్ రిజిజు, రాందాస్ అథవాలే, కాంగ్రెస్ అధినాయకురాలు సోనియాగాంధీ, ఏఐసీఈసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తదితర నేతలు ఈ ఫొటో సెషన్లో పాల్గొన్నారు
కేఆర్ సురేశ్రెడ్డికి ఘనంగా వీడ్కోలు
రాజ్యసభలో పదవీ విరమణ పొందనున్న బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కేఆర్ సురేశ్రెడ్డికి బుధవారం బీఆర్ఎస్ ఎంపీలు సహా పలువురు ఘనంగా వీడ్కోలు పలికారు. ఢిల్లీలోని పార్లమెంట్ ఆవరణలో బుధవారం ఆయనతో ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, దీవకొండ దామోదర్రావు, డాక్టర్ బండి పార్థసారథిరెడ్డి ప్రత్యేకంగా ఫొటోలు దిగారు. సభలో సురేశ్రెడ్డి మాట్లాడుతున్నప్పుడు బీఆర్ఎస్ ఎంపీలు ఆయన వెనుక ఒకే సీటులో కూర్చొన్నారు. అనంతరం కేఆర్ సురేశ్రెడ్డితో పాటు పదవీ విరమణ చేయనున్న సభ్యులకు రాజ్యసభ చైర్మన్ సీపీ రాధాకృష్ణన్, పలువురు కేంద్ర మంత్రులు, సహచర ఎంపీలు కరచాలనం చేసి ఘనంగా వీడ్కోలు పలికారు.