హైదరాబాద్, మార్చి 12 (నమస్తే తెలంగాణ) : ఇంటర్ పరీక్షల్లో ఒకేరోజు 57 మాల్ప్రాక్టీస్ కేసులు నమోదయ్యాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 27, నిజామాబాద్ జిల్లాలో 26, పెద్దపల్లిలో 3, హైదరాబాద్లో ఒకటి చొప్పున మాల్ప్రాక్టీస్ కేసులు నమోదయ్యాయి. మంగళవారం సెకండియర్ పరీక్షలకు 4,50,525 మంది విద్యార్థులు హాజరు కాగా, 14,778 మంది గైర్హాజరైనట్టు ఇంటర్బోర్డు అధికారులు తెలిపారు.