హైదరాబాద్: వచ్చే ఆర్థిక సంవత్సరానికిగాను రూ.2,75,891 కోట్లతో బడ్జెట్ను మంత్రి భట్టువిక్రమార్క (Minister Bhatti Vikramarka) ప్రవేశపెట్టారు. ఇందులో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలైన ఆరు గ్యారెంటీల అమలుకు రూ. 53,196 కోట్లు ప్రతిపాదించారు. ఈ కేటాయింపు ఒక ప్రాథమిక అంచనా ప్రకారమే చేశామని మంత్రి అన్నారు. హామీలకు సంబంధించిన విధివిధానాలను రూపొందించే పని ఇంకా కొనసాగుతున్నందున, అది పూర్తయిన వెంటనే అమలుకు అవసరమైన పూర్తి నిధులు కేటాయిస్తామని చెప్పారు. అదేవిధంగా..
ఎస్సీ గురుకులాల భవన నిర్మాణాలకు- రూ.1000 కోట్లు
ఎస్టీ గురుకులాల భవన నిర్మాణాలకు- రూ.250 కోట్లు
ఎస్సీ సంక్షేమానికి- రూ.21,874 కోట్లు
ఎస్టీ సంక్షేమానికి- రూ.13,313 కోట్లు
మైనార్టీ సంక్షేమానికి- రూ.2,262 కోట్లు
బీసీ గురుకులాల సొంత భవనాల నిర్మాణానికి- రూ.1,546 కోట్లు
బీసీ సంక్షేమానికి- రూ.8,000 కోట్ల చొప్పున కేటాయించారు.