హైదరాబాద్ ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ చరిత్రలో తొలిసారి 50 అడుగుల మట్టి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు.
పంచముఖ మహాలక్ష్మి అవతారంలో బుధవారం నుంచి దర్శనమిచ్చే వినాయకుడికి తొలిపూజ ఉదయం 5 గంటలకు ప్రారంభంకానున్నది. 6 గంటలకు జంధ్యం, నూలు కండువా, గరికమాల సమర్పిస్తామని ఉత్సవ కమిటీ తెలిపింది.