హైదరాబాద్, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్రం నుంచి ఈ సీజన్లో సుమారు రూ.65 కోట్ల విలువైన 5 వేల టన్నుల మామిడి పండ్లను ఎగుమతి చేసే అవకాశం ఉన్నదని ఉద్యానశాఖ అంచనా వేస్తున్నది. ఈ నెల 26న మామిడి ఎగుమతిదారులు, రైతులతో సమావేశం నిర్వహించనున్నట్టు ఉద్యానశాఖ డైరెక్టర్ ఎల్ వెంకట్రామిరెడ్డి తెలిపారు. రాష్ట్రంలో 3.05 లక్షల ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నాయి. ఈ ఏడాది 11.48 లక్షల టన్నుల ఉత్పత్తి వస్తుందని అంచనా.