హైదరాబాద్, మే 27 (నమస్తే తెలంగాణ): డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) మొదటి విడత రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగుతున్నది. శనివారం వరకు 46,916 దరఖాస్తులు వచ్చాయి. వెబ్ ఆప్షన్లు సైతం ప్రారంభం కాగా, 17,956 మంది వెబ్ ఆప్షన్లు ఎంచుకున్నారు. జూన్ 10 వరకు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశముండగా, జూన్ 11 వరకు మొదటి విడత వెబ్ ఆప్షన్లు ఎంచుకోవచ్చు.