హైదరాబాద్, జూన్ 30 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో గురువారం 468 మందికి పాజిటివ్గా తేలింది. కేసులు పెరుగుతుండటంతో రికవరీ రేటు 98.91 శాతానికి తగ్గింది. మరోవైపు గురువారం 246 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. అత్యధికంగా హైదరాబాద్లో 253, రంగారెడ్డిలో 47, సంగారెడ్డిలో 34, మేడ్చల్ మల్కాజిగిరిలో 39 కేసులు వెలుగు చూశాయి.
గురువారం కొవిడ్ కేసులు
కొత్త కేసులు : 468
మరణాలు : 0
కోలుకున్నవారు : 246
రికవరీ రేటు : 98.91%
యాక్టివ్ కేసులు : 4,643