గుర్తించిన ప్రముఖ పురావస్తు పరిశోధకుడు ఈమని శివనాగిరెడ్డి
హైదరాబాద్, జూలై 24 (నమస్తే తెలంగాణ): కొత్తరాతియుగపు ఆనవాళ్లను మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర మండలం బస్వాయిపల్లి శివారులో గుర్తించినట్టు ప్రముఖ పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇం డియా ఫౌండేషన్ సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి తెలిపారు. వైటీడీఏ ఆధ్వర్యంలో కొలనుపాక సోమేశ్వర, ప్రతాపరుద్ర ఆలయాల పరిరక్షణ పనులకు కావాల్సిన కొత్త గ్రానెట్ రాయి కోసం అన్వేషిస్తుండగా బస్వాయిపల్లి వేణుగోపాలస్వామి ఆలయ సమీపంలోని బండపై కొత్తరాతియుగపు మానవులు రాతి గొడ్డళ్లను పదునుపెట్టి అరగదీసేందుకు ఉపయోగించిన గుంటలను గుర్తించామని చెప్పారు.
నాలుగు నుం చి ఎనిమిది అంగుళాల పొడవు, రెండు నుంచి నాలు గు అంగుళాల వెడల్పు, రెండు అంగుళాల లోతులో నాలుగు గుంటలు ఉన్నాయని వివరించారు. సమీపంలోని దరిపల్లి, తాటికొండ, రాచాల, మూసాపేటలో ఇలాంటి గుంటలున్నాయని, తద్వారా ఈ ప్రాంతం కొత్తరాతియుగంలో నివాస స్థావరంగా ఉండేదని తెలుస్తున్నదన్నారు. వీటిని భవిష్యత్తుతరాలకు అందించాలని గ్రామస్థులకు శివనాగిరెడ్డిని కోరారు. కార్యక్రమంలో వడ్డె మొగిలయ్య తదితరులు పాల్గొన్నారు.