హైదరాబాద్, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ) : జేఈఈ మెయిన్ పరీక్షల నిర్వహణలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఇష్టారీతిన వ్యవహరిస్తున్నది. జేఈఈ పరీక్షలు నిర్వహించే పట్టణాల జాబితా నుంచి రాష్ట్రంలోని ఆదిలాబాద్, గద్వాల, మంచిర్యాల, వికారాబాద్ కేంద్రాలను తొలగించింది. గత ఏడాది రాష్ట్రంలో 21 పట్టణాల్లో జేఈఈ మెయిన్ పరీక్షలు నిర్వహించగా, ఈ ఏడాది 17 పట్టణాలకే పరిమితం చేసింది. ఆదిలాబాద్ నుంచి పరీక్ష రాసే వారు ఇకనుంచి నిజామాబాద్ లేదా హైదరాబాద్లో, వికారాబాద్ అభ్యర్థులు హైదరాబాద్ లేదా సంగారెడ్డిలో, గద్వాల అభ్యర్థులు 95 కిలోమీటర్లు ప్రయాణించి మహబూబ్నగర్లో పరీక్షలు రాయాల్సిన పరిస్థితిని ఎన్టీఏ తీసుకురావడంపై పలువురు విస్మయం వ్యక్తంచేస్తున్నారు.
ఆదిలాబాద్, గద్వాల, హయత్నగర్, హైదరాబాద్/సికింద్రాబాద్, జగిత్యాల, జనగాం, కరీంనగర్, ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్, మహబూబ్నగర్, మంచిర్యాల, మెదక్, మేడ్చల్, నల్లగొండ, నిజామాబాద్, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట,
వికారాబాద్, వరంగల్.
హయత్నగర్, హైదరాబాద్/సికింద్రాబాద్, జగిత్యాల, జనగాం, కరీంనగర్, ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్, మహబూబ్నగర్, మెదక్, మేడ్చల్, నల్లగొండ, నిజామాబాద్, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్.
జేఈఈ మెయిన్ ప్రపంచంలోనే రెండో కఠినమైన పరీక్షగా ఇటీవలే వెల్లడైంది. ఇలాంటి పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు కాస్త ప్రశాంతత అవసరం. పరీక్షలకు ముందు అత్యధిక దూరం ట్రావెల్ చేయరాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయినా వీటన్నింటిని ఎన్టీఏ పట్టించుకోకపోవడం దారుణమని పలువురు పేర్కొంటున్నారు.