జగిత్యాల, ఫిబ్రవరి 13: వచ్చే ఉగాది నుంచి ఆసరా పెన్షన్లు రూ.4 వేలు ఇస్తామని పట్టభద్రుల ఎమ్మెల్సీ టీ జీవన్రెడ్డి తెలిపారు. కటాఫ్ డేట్తో సంబంధం లేకుండా బీడీ కార్మికులందరికీ పెన్షన్లు అందిస్తామని పేర్కొన్నారు. మంగళవారం ఆయన జగిత్యాల జిల్లా కేంద్రంలోని టీఆర్నగర్లో పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల మేరకు త్వరలోనే గృహజ్యోతి పథకాన్ని అమలు చేస్తామని చెప్పారు. ఇండ్లు లేని నిరుపేదలందరికీ ఇండ్లు నిర్మించి ఇస్తామని, వచ్చే నెల నుంచి అర్హులందరికీ రూ.500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్తు పథకాలు అమలు చేస్తామని ప్రకటించారు. 2014 తర్వాత ప్రావిడెంట్ ఫండ్ కట్ అవుతున్న వారందరికీ రూ.4 వేల పెన్షన్ ఇస్తామని చెప్పారు. తనకు ఆశించిన పదవి రాకున్నా రాబోయే రోజుల్లో ఊహించని పదవి వరించవచ్చని పేర్కొన్నారు.