హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో 38 ఫాస్ట్ట్రాక్ కోర్టులను రెగ్యులర్ కోర్టులుగా మార్చుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో 22 ఫాస్ట్ట్రాక్ కోర్టులను అదనపు జిల్లా సెషన్స్ జడ్జి కోర్టులుగా, మరో 16 ఫాస్ట్ ట్రాక్ కోర్టులను సీనియర్ సివిల్ జడ్జి కోర్టులుగా మార్చారు.
మొత్తం 38 కోర్టులకు 1,098 పోస్టులు మంజూరు చేస్తూ జీవో జారీ చేసింది. 22 అదనపు జిల్లా సెషన్స్ జడ్జి కోర్టుల్లో 682 పోస్టులు, 16 సీనియర్ సివిల్ జడ్జి కోర్సుల్లో 416 పోస్టులు మంజూరు అయ్యాయి. మరో 14 అదనపు జిల్లా సెషన్స్ జడ్జి కోర్టుల్లో 308 పోస్టులు మంజూరు అయ్యాయి. ఈ మేరకు పోస్టులు మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.