నిజామాబాద్: శ్రీరాం సాగర్ ప్రాజెక్టుకు వరద కొనసాగుతున్నది. దీంతో అధికారులు 36 గేట్లను ఎత్తివేసి వచ్చిన నీటిని వచ్చినట్లు దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులోకి ప్రస్తుతం 4,18,510 క్యూసెక్కుల వరద వస్తుండగా, 4 లక్షల 50 వేల క్యూసెక్కుల నీరు నదిలోకి వెళ్తున్నది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగా, ప్రస్తుతం 1087.40 అడుగుల వద్ద నీటిమట్టం ఉన్నది. 90.30 టీఎంసీల నీటినిల్వకు గాను ఇప్పుడు 74.506 టీఎంసీల నీరు ఉన్నది.
ఇక ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా వరద వస్తుండటంతో 54 గేట్లను అధికారులు ఎత్తివేశారు. దీంతో ప్రాజెక్టులోకి 13 లక్షల క్యూసెక్కుల నీరు వస్తుండగా, 13.30 లక్షల క్యూసెక్కుల నీరు వెళ్తున్నది.