హైదరాబాద్, మార్చి 24 (నమస్తే తెలంగాణ) : పాఠశాల విద్యలో ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ (ఎఫ్ఎల్ఎన్) నోడల్ అధికారుల కోసం ప్రభుత్వం రూ.36.12 లక్షల నిధులను విడుదల చేసింది. రాష్ట్రంలో 602 మంది ఎఫ్ఎల్ఎన్ నోడల్ అధికారులుండగా, వీరికి ఏటా రవాణా భత్యంగా 6 వేలు చెల్లించనున్నారు.
ఆయా నిధులను సంబంధిత స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ అకౌంట్లకు బదిలీ చేసినట్టు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన తెలిపారు.