హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ): తెలంగాణ వ్యాప్తంగా ఉన్న పాస్పోర్టు సేవాకేంద్రాల్లో శనివారం 3200 దరఖాస్తులను పరిశీలించినట్టు రీజినల్ పాస్పోర్టు అధికారి దాసరి బాలయ్య ఓ ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణలోని ఐదు పాస్పోర్టు సేవాకేంద్రాలు, రెండు పోస్టాఫీసు పాస్పోర్టు సేవా కేంద్రాలలోనూ వేగంగా దరఖాస్తుల పరిశీలన సాగుతున్నట్టు తెలిపారు. ఈ క్రమంలో దరఖాస్తుల సంఖ్య పెరగడంతో అపాయింట్మెంట్లను పెంచినట్టు వివరించారు.