హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ): శబరిమలకు వెళ్లే భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే 32 ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసింది. హైదరాబాద్-కొట్టాయం రైల్వేస్టేషన్ల మధ్య 18 రైలు సర్వీసులు, మచిలీపట్నం-కొట్టాయం మధ్య 10 సర్వీసులు, సికింద్రాబాద్-కొట్టాయం మధ్య 4 సర్వీసులను ఏర్పాటు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.