కుమ్రం భీం ఆసిఫాబాద్ : కౌటాల మండలంలోని శీర్ష గ్రామ సమీపంలో శుక్రవారం సాయంత్రం ఎడ్ల బండిపై పిడుగు పడింది. దీంతో ఓ ఎద్దు సహా ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ముత్తపేట గ్రామానికి చెందిన బొర్కుట్ పున్నయ్య (58), కనికి శివారులోని తన వ్యవసాయ భూముల్లో పనులు ముగించుకొని ఎడ్లబండిపై తిరిగి వస్తున్నాడు.
ఈ ఎడ్ల బండిపై ముత్తపేట గ్రామానికి చెందిన దొంగ్రి పద్మ (35), ఆమె కూతురు దొంగ్రి శ్వేత (22) ఉన్నారు. మార్గమధ్యలో ఎడ్లబండిపై పిడుగు పడటంతో ఎడ్లబండి నడుపుతున్న పున్నయ్యతో పాటు శ్వేత, పద్మ మృతి చెందారు. ఈ ఘటనలో ఎద్దు కూడా ప్రాణాలు కోల్పోయింది. మృతుల నివాసాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.