హైదరాబాద్, జనవరి 1: న్యూ ఇయర్ వేళ ఎక్కువ మంది బిర్యానీకే జైకొట్టారు. శనివారం రికార్డుస్థాయిలో 3.50 లక్షల బిర్యానీ ఆర్డర్లు డెలివరీ చేసినట్టు ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ వెల్లడించింది. అలాగే 2.5 లక్షల పిజ్జాలను కస్టమర్లకు అందించనట్టు పేర్కొన్నది. ట్విట్టర్లో నిర్వహించిన పోల్ ప్రకారం..అత్యధికంగా 75.4 శాతం మంది హైదరాబాద్ బిర్యానీనే ఆర్డర్ చేసినట్టు తెలిపింది.14.2 శాతం మంది లక్నో బిర్యానీ, 10.4 కోల్కతా బిర్యానీ ఆర్డర్ చేసినట్టు పేర్కొన్నది. హైదరాబాద్ బావర్చీ హోటల్లో నిమిషానికి రెండు బిర్యానీలు అమ్ముడయ్యాయట.