హైదరాబాద్, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ): ఎన్నికల తాయిలాలకు చెక్ పెట్టేందుకు శనివారం హైదరాబాద్లో టాస్క్ఫోర్స్ సిబ్బం ది చేపట్టిన తనిఖీల్లో రూ.3.5 కోట్లు పట్టుబడింది. బంజారాహిల్స్ చెక్పోస్టు వద్ద పట్టుబడిన ఆ డబ్బుకు ఎలాంటి రశీదులు లేకపోవడంతో ఐటీ అధికారులకు అప్పగించారు. విచారణలో గ్రూపు చైర్మన్ మహేశ్రెడ్డి పేరు బయటికొచ్చింది. దీంతో ఆయన ఇండ్లు, గ్రూపు సంస్థలు, వ్యాపార సముదాయాలు సహా మొత్తం 12 చోట్ల సోదాలు చేపట్టారు. విలువైన పలు పత్రాలు, డిజిటల్ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం మహేశ్రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారిస్తు న్నారు. ఎన్నికల నేపథ్యంలో ఆయన ఇతర రాష్ర్టాల నుంచి డబ్బు తెచ్చి కాంగ్రెస్కు ఇస్తున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.