మహబూబ్నగర్: మహబూబ్నగర్లోని న్యూ మోతీనగర్లో భోజనం వికటించడంతో 29 మంది అస్వస్థతకు గురయ్యారు. బాధితులను ప్రభుత్వ దవాఖానకు తరలించి, చికిత్స అందిస్తున్నారు. వీరిలో 17 మంది చిన్నారులు, ఓ గర్భిణి ఉన్నారు. మోతీనగర్లో గురువారం జరిగిన ఓ వివాహ విందులో మిగిలిన భోజనాన్ని పలువురు బస్తీవాసులకు ఇచ్చివెళ్లారు. శుక్రవారం ఈ ఆహారం తిన్నవారు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనపై పోలీసులు, వైద్యాధికారులు విచారణ చేపడుతున్నారు. దవాఖానలో బాధితులను మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు.